Home / Uncategorized / బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్థారక పరీక్షలు చేయించాలని కూడా సిఎం నిర్ణయించారు. గ్రామస్థాయిలో పనిచేసే వైద్య అధికారులు, సిబ్బంది సేవలను మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆశ వర్కర్లకు మరోసారి జీతాలు పెంచాలని నిర్ణయించిన సిఎం కేసీఆర్, సెకండ్ ఎఎన్ఎంలకు కూడా జీతాలు పెంచనున్నట్లు ప్రకటించారు.ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సిఎం సూచించారు.

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ వాకాటి కరుణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ లలితకుమారి, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల, ఎంపీ  కవిత చొరవతో కదలికతాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో బోదకాలు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రికి విన్నవించారు. ప్రభుత్వం వారికి అండగా నిలవాలని, సరైన వైద్యం అందించాలని, బోదకాలు వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వ అధికారులపై కూడా వత్తిడీ తెచ్చారు. వారి చొరవతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తన సొంత జిల్లాలో కూడా బోదకాలు బాధితులు ఎక్కువగానే ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బోదకాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బోదకాలుతో బాధపడుతున్న వారిని ఆదుకునే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. బోదకాలు వ్యాధి గ్రస్తులకు అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా బోదకాలు బాధితుల సమగ్ర సర్వే నిర్వహించాలని, గ్రామాల్లో వారి వివరాలు తీసుకోవాలని సిఎం కోరారు. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికి క్రమం తప్పకుండా రోగ నిర్ధారక పరీక్షలుఅమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ ఒక్కరు ఎప్పటికప్పుడు రోగ నిర్థారక పరీక్షలు చేయించుకుంటారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతీ ఒక్కరికి అలాంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారు పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలో ఉన్నవారు, ముఖ్యంగా పేదలు రోగమొచ్చినప్పుడు తప్ప ఆసుపత్రులకు వెళ్ళరు. వైద్య పరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. ముదిరిన తర్వాత నయం చేయడం చాలా కష్టం. బోదకాలు కూడా అలాంటిదే. ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కానీ ముదిరే దాక గుర్తించరు. చాలా రోగాల విషయాల్లో ఇలాగే జరుగుతుంది. ఇకపై అలా జరగడానికి వీలులేదు. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వమే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంది. రక్త నమూనాలు సేకరించి, అన్ని రకాల రోగ నిర్ధారక పరీక్షలు చేయించాలి. రోగం గుర్తించిన వెంటనే ప్రభుత్వ పరంగానే చికిత్స చేయాలి. మందులు అందించాలి. దీనికోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కన్నా మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి ఏదీ లేదు. ముందస్తు పరీక్షలు చేయడంతోపాటు వివిధ రకాల రోగాలు ప్రబలకుండా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యం తీరు మారింది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎంతో మెరుగయ్యాయి. కేసీఆర్ కిట్స్ పథకం అద్భుతంగా అమలవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. వైద్య అధికారులు, సిబ్బంది పనితీరుపై సర్వత్రా సంతృప్తి, సంతోషం వ్యక్తమవుతున్నది. వైద్యాధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా మలేరియా, డెంగ్యూ మరణాలు తగ్గాయి. ఈ ఒరవడి, స్పూర్తి కొనసాగాలి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల ముంగిట్లోకే వైద్యం చేరాలి. స్థానికంగానే వారికి వైద్య సేవలు అందాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పలు విధాలైన వైద్య అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరనీ సమన్వయం చేసుకుంటూ, గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆశ వర్కర్లకు ఒకసారి జీతాలు పెంచాం. మరోసారి కూడా జీతాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంటుగా గుర్తిస్తాం. సెకండ్ ఎఎన్ఎం జీతాలు కూడా పెంచుతాం. వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. పి.హెచ్.సి.లలో కూడా సౌకర్యాలు పెంచుతాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యం విషయంలో దేశానికే దారి చూపే విధంగా తయారు కావాలన్నది లక్ష్యం’’ అని సిఎం ప్రకటించారు. కేసీఆర్ కిట్స్ పథకం ప్రైవేటుకు లేదు: కేసీఆర్ స్పష్టీకరణకేసీఆర్ కిట్స్ పథకం అద్బుతంగా అమలవుతున్నది. పేదలకు ఎంతో మేలు కలుగుతున్నది. అనవసర ఆపరేషన్లు బాగా తగ్గాయి. అదనపు భారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపికగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇన్సెంటివ్ ఇస్తాం. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపచేయాలనే వినతులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన సౌకర్యాలు పెంచుతాం. సిబ్బందిని పెంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకుంటాం తప్ప, ప్రైవేటు ఆసుపత్రులకు కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపచేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు’’అని సిఎం స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా బోదకాల వ్యాధి బాధితులు

1. జగిత్యాల – 6463

2. సిద్దిపేట –   5199

3. సూర్యాపేట – 4587

4. కామారెడ్డి  –  3342

5. ఖమ్మం  –  2886

6. సిరిసిల్ల – 2350

7. జనగాం – 2189

8. కరీంనగర్ – 1892

9. నిజామాబాద్ – 1847

10. వికారాబాద్ – 1823

11. వరంగల్ (రూరల్) – 1777

12. మహబూబాబాద్ – 1682

13. నల్గొండ – 1567

14. సంగారెడ్డి – 1464

15. యాదాద్రి – 1410

16. వరంగల్ అర్బన్ – 1051

17. మెదక్ – 1047

18. పెద్దపల్లి – 913

19. అదిలాబాద్ – 673

20. మహబూబ్ నగర్ – 644

21. అసిఫాబాద్ – 479

22. నిర్మల్ – 292

23. మంచిర్యాల్ – 274

24. జయశంకర్ – 174

25. కొత్తగూడెం – 142

26. నాగర్ కర్నూల్ – 112

27. మేడ్చల్ – 71

28. రంగారెడ్డి – 55

29. గద్వాల్ – 39

30. వనపర్తి – 32

31. హైదరాబాద్ – 0

…………………………………..

మొత్తం – 46,476

……………………………………

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat