వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.
అయితే గత వారం రోజులుగా కేంద్రం బడ్జెట్ లో ఏపీకి చేసిన అన్యాయానికి ఇటు టీడీపీ అటు వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,నేతలు బీజేపీ పార్టీ సర్కారు పై విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే వైసీపీ నుండి టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎంపీలు ఏమి స్పందించకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాలు.ఇలాంటి సమయంలోనే తెరపైకి వచ్చారు కొత్తపల్లి గీత.ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెగ బాధపడుతున్న టీడీపీ నేతలు గత నాలుగు ఏండ్లుగా కేంద్ర సర్కారు కేటాయించిన నిధులకు లెక్కలు ఎందుకు చెప్పడంలేదు.
see also :ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించిన మంత్రి కేటీఆర్
అయిన చిన్న చితక నేతలందరూ స్పందిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడంలేదు అని ఆమె విమర్శించారు .అయిన బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారని గతంలో సన్మానాలు చేసిన టీడీపీ నేతలు ఆ విషయాన్నీ మరిచిపోతున్నారా .అయిన కేంద్రమే రాష్ట్రానికి అడిగినదాని కంటే ఎక్కువగా నిధులు కేటాయించారు అని ఆమె టీడీపీపై ఫైర్ అయ్యారు.అయితే కొత్తపల్లి గీత వ్యాఖ్యలను బట్టి ఆమె త్వరలోనే బీజేపీ పార్టీలోకి జంప్ అవుతారు.అక్కడ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే గీత ఇలా టీడీపీ పై విరుచుకుపడుతున్నారు.మొదట వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆమె అతి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
see also :వదినతో ఏర్పడిన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు..ఏం చేశాడో తెలుసా..!
see also :ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!