సినీ నటుడు మంచు మోహన్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు అడిగి మరీ సన్మానాలు చేయించుకుంటారు కదా..:! అన్న ప్రశ్నకు స్పందించిన మోహన్బాబు.. టీ.సుబ్బిరామిరెడ్డి కళాకారులను చాలా గౌరవిస్తారు. అందులో భాగంగానే నన్ను కూడా పిలిచి అప్పుడప్పుడు సన్మానం చేస్తారని బదులిచ్చారు.
ఇంకా మీ స్తాయికి తగ్గ టీటీడీ ఛైర్మన్. అటువంటి పదవిని అలంకరించకుండా ఫిల్మ్నగర్ దేవస్థానం ఛైర్మన్ పదవిని అలంకరించారేంటి..? అందులోనూ చంద్రబాబు మీకు బంధువు, మిత్రుడు కూడాను. అటువంటిది మీరు అడిగితే టీడీపీ ఛైర్మన్ పదవి ఇస్తారు కదా..! అన్న ప్రశ్నకు మోహన్బాబు స్పందిస్తూ.. రూ.50 కోట్లో.. వంద కోట్లో ఇస్తే ఆ పదవి ఇవ్వొచ్చేమోకానీ.. అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఫిల్మ్నగర్ దేవస్థానం ఛైర్మన్ పదవి గురించి మాట్లాడుతూ.. అందరూ కలిసి తన మెడలు వంచి మరీ ఆ ఛైర్మన్ పదవిని తనకు కట్టబెట్టారన్నారు. ఇక
చేసేది లేక ఆ పదవిలో కొనసాగుతున్నానన్నారు మంచు మోహన్బాబు.
see also : ఛీ..హీరో రాజశేఖర్ పరువు తీశాడు..!!
వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి లానే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, అలాగే. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబడేవారని, వైఎస్ జగన్ కూడా వైఎస్ఆర్లానే ప్రజా సంకల్ప యాత్రలో అమలుపరిచ గలిగే హామీలను మాత్రమే ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు.