ఈ మద్య ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. విశాఖ, ప్రకాశం, కర్నూల్ , అనంతపురం ఇలా కొన్ని జిల్లాలో జరిగిన సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దాడులు జరిగిన తరువాత ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని మీడియా ముందు చెప్పడం మనకు తెలిసిందే..అయితే ఎన్ని చట్టాలు వచ్చిన, కేసులు పెట్టిన అమ్మాయిలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు.. తాజాగా గుంటూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరులో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నల్లచెరువు 14వ లైన్కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత నెల ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి ఐస్క్రీమ్ కొనిస్తామని ఆటోలో తీసుకుని వెళ్లారు.
see also..వైఎస్ జగన్ స్ఫూర్తితోనే.. ”భరత్ అనే నేను”
రెండు సార్లు బాలికపై అత్యాచారం చేశారు. రెండోసారి పొలాల్లోకి తీసుకుని వెళ్లి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఆర్టీసి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. నలుగురిపై బాలిక తండ్రి ఫిర్యాదు నల్లచెరువు 14వ లైన్ ప్రాంతానికి చెందిన రంగ, వెంకటేష్, సుబ్బు, సురేష్ తమ కూతురిపై సామూహిక అత్యాచారం చేశారని బాలిక తండ్రి శుక్రవారం లాలాపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.నిందితులు గతంలోనూ ఇద్దరు బాలికలపై లైంగిక దాడి చేసి పెద్దల పంచాయతీతో బయటపడినట్లు తెలుస్తోంది.