ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కల్సి ఇచ్చిన ప్రత్యేక హోదా ,విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ ,పోలవరం ప్రాజెక్టుకు ఇలా పలు అంశాలకు సంబంధించి నిధులు కేటాయించకపోవడమే కాకుండా అసలు వాటి ఊసే లేకుండా కేంద్ర సర్కారు బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.
see also :రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
దీనిపై అధికార టీడీపీ పార్టీ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఏపీ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తూ కనీసం నోరు మెదపకుండా తూ తూ మంత్రంగా ధర్నాలు రాస్తోరోకులు చేస్తూ తిరిగి వైసీపీ పార్టీ పై విమర్శల వర్షం కురిపించారు తెలుగు తమ్ముళ్ళు.దీనిపై వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ గత నాలుగు ఏండ్లుగా కేంద్రాన్ని రాష్ట్ర సర్కారును విభజన హామీలను ,ఎన్నికల హామీలను నెరవేర్చాలని పోరాటం చేస్తూనే ప్రత్యేక హోదా లాంటి అంశాల గురించి అలుపు ఎరగని పోరాటాలు చేస్తున్నాం .
see also :టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్
ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రం ఏపీను అన్యాయం చేసింది .ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పై పోరాడకుండా తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు.దమ్ముంటే రమ్మనండి ..కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలతో సహా అందరం రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తాం ..కేంద్రం ఎందుకు దిగిరాదు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబు ఎక్కడ తనని జైలుకు పంపుతుందేమో అని మోదీ సర్కారును ఏమి అనడంలేదు .బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయం జరిగిన కానీ కనీసం ఒక్క మాట మాట్లాడని సీఎం ను చంద్రబాబును మాత్రమే చూస్తున్నాను అని ఆయన విరుచుకుపడ్డారు .
see also :సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం… వైసీపీ లోకి స్టార్ డైరక్టర్..?..