ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు జల్సాలో తనతో నటించిన పార్వతీ మెల్టన్, అలాగే పూనమ్ కౌర్లకు మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మరో వైపు కత్తి మహేష్ కూడా పవన్ కల్యాణ్ పార్వతీ మెల్టన్, పూనమ్కౌర్తోనే కాదని, మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానని కూడా చెప్పాడు కత్తి మహేష్.
ఇదిలా ఉండగా.. బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్ను సొంతం చేసుకున్న యాంకర్ కమ్ నటి అనసూయకు పవన్ కల్యాణ్కు మధ్య ఎఫైర్ ఉందంటూ.. వారిద్దరూ కలిసి కారులో చక్కర్లు కొట్టారని సోషల్ మీడియా లో పోస్టులు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే తన పిల్లలను భర్త వద్ద ఉంచి స్టార్ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని, అందుకే అనసూయకు సినిమా అవకాశాలు పెరిగాయని సోషల్ మీడియాలో పోస్టులు కోకొల్లలుగా పోస్టయ్యాయి.
అయితే, గత మంగళవారం హాట్ యాంకర్ అనసూయ తన ఫోటోలు తీస్తున్నాడన్న అనుమానంతో ఓ ఆరేళ్ల బాలుడి చేతిలోని స్మార్ట్ఫోన్ను పగలగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఆ సమయంలో అనసూయ ప్రయాణిస్తున్న కారులో ఓ స్టార్ హీరో ఉన్నాడంటూ వార్తలను ప్రచురించింది. అనసూయ ఫోటో పక్కన పవన్ కల్యాణ్ ఫోటో బ్లర్ చేసి మరీ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియా కోడై కూసింది.
ఈ విషయంపై అనసూయ క్లారిటీ ఇస్తూ.. సోసల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడం అన్యాయమని, వారికి అసలు ఇలాంటి నీచపు, నికృష్టపు ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. తమ రేటింగ్ కోసం మరీ ఇంతలా బరితెగిస్తారా అని, మరో సారి ఇలా తనపై పోస్టులు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది అనసూయ.