ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.అసలు విషయానికి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి ఈ రోజు సోమవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
see also : తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి ..
ఈ భేటీ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి మంత్రి సోమిరెడ్డితో జిల్లాలో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను వివరించారు.అంతే కాకుండా జిల్లాలో రైతులకు రావాల్సిన బుడ్డ శనగ పంట ఇన్సురెన్స్ కింద మొత్తం రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు.
see also : తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య
అంతే కాకుండా దీనికి సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించారు .అయితే ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు మంత్రి సోమిరెడ్డి ..అయితే బాబు అనుకూల మీడియా మాత్రం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రసారం చేస్తున్నాయి.