ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 వేల పోస్టులు భర్తీ చేయ నున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన ప్రతి పాదనలు ముఖ్యమంత్రికి పంపామన్నారు. సీఎం ఆమో దించగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. కాని స్టేబుళ్ల కొరత ఉన్నప్పటికీ ఉన్నవారే కష్టపడుతుండటం అభినందనీయమన్నారు.
see also..సీఎం రమేష్ ఆఫీసుపై దాడి చేసి నిప్పు పెట్టి తగులబెట్టిన టీడీపీ నేతలు …