వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై వరుసగా చేస్తున్న ప్రకటనలు.. సవాళ్ళ దెబ్బకి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మరోసారి దిక్కుమాలిన వ్యాఖ్యలకు తెరలేపారు. ప్రత్యేకహోదా పై జగన్ దూకుడు తట్టుకోలేక పోతున్న టీడీపీ బ్యాచ్ మొత్తం.. జగన్ పై పవర్లెస్ అటాక్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప యూజ్లెస్ కామెంట్స్ చేశారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని.. అందుకే జగన్- బీజేపీలు ఒకరి పై ఒకరు ఎన్నడూ విమర్శలు చేసుకోవడంలేదని ఆరోపణలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ అన్న తర్వాత కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక బీజేపీ మంత్రుల రాజీనామాల గురించి మాట్లాడుతూ.., రాజీనామాలు చేయటం వారి ఇష్టమని.. బీజేపీ విషయంలో తామిప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని చినరాజప్ప అన్నారు. దీంతో సోషల్ మీడియాలో చినరాజప్ప పై సెటైర్లు వేస్తున్నారు. హోంమంత్రి ఇప్పుడే నిద్ర లేచారని.. జగన్ ప్రకటనలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలని.. జగన్ మాటలు చెవులు దగ్గర పెట్టుకొని వింటే అర్ధమవుతోందని.. సోషల్ మీడియాలో చినరాజప్ప పై విరుచుకుపడుతున్నారు.