ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము..
వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే
తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు
గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో ప్రభుత్వం ఘనవిజయం సాధించింది
మన వాటా నీటిని మన ప్రభుత్వం విధిగా వాడుకుంటుంది…ప్రాజెక్టులు కట్టి వాటిని ఒడిసిపట్టుకుంటుంది…కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలు సాగులోకి వస్తాయి
మన నిధులు మనకు ఖర్చు చేయడంలో కేసీఆర్ గారు ఘన విజయం సాధించారు…ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు..మోడీ ప్రభుత్వం వచ్చాక మధ్య తరగతి వాడు చితికి పోయాడు …ఎక్కువ శ్రమ చేస్తూ తక్కువ జీతం తీసుకుంటున్న హోం గార్డులు, అంగన్ వాడి మరియు ఆశ వర్కర్ల జీతాలు పెంచి ఆదుకున్నారు కేసీఆర్…ఇదే కాకుండా సామాన్య ప్రజల మీద ప్రత్యేక్షంగా పరోక్షంగా భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు ..అంతెందుకు రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి రూపంలో ఈ ఏడాది ఏప్రిల్ నుండి అందించబోతున్నారు…ఈ నిర్ణయంతో మొత్తం దేశాన్ని ఆలోచింపజేశారు కేసీఆర్ గారు
ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తుంది…తొలి రెండేళ్లు కమలనాథన్ కమిటీ కాలయాపన తో మన ప్రభుత్వానికి కొంత ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తరువాత ఉద్యోగ నియామకాల్లో దూకుడుగా వ్యవహరించి ఇప్పటికే 40000 ఉద్యోగాలకు పైచీలు నియామకాలు చేపట్టి ఔరా అనిపించుకుంది…ఇంకో ఏడాదిన్నరలో మిగితా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది.ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చేసింది చేస్తుంది…ఏ ప్రభుత్వాలు ఇస్తున్నాయి అండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి చెప్పండి…ఒక్క కేసీఆర్ ప్రభుత్వం తప్పా…!!
కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు కళ్యాణలక్ష్మి , షాది ముబారక్ వంటి పథకాలతో 75,116₹ ఇస్తూ బాసటగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ గారిది
ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి పండు ముసలివారికి మన ప్రభుత్వం నుండి ఏదో రకంగా లబ్ది పొందుతున్నవారే
వాస్తవానికి కేసీఆర్ గారు ప్రజలు అనుకున్నదానికంటే 1000 రేట్లు ఎక్కువే చేశాడు చేస్తున్నారు..ఇవి చాలదా కేసీఆర్ గారిని ప్రజలు మళ్లీ అధికారం ఇస్తారు అని చెప్పడానికి
ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు షీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల పాలనతో విసిగెత్తిపోయారు…మన కేసీఆర్ గారి పాలనను దిల్సే ఆశ్వదిస్తూ..
– రఘువీర్ రాథోడ్