Home / MOVIES / మెగా, నంద‌మూరి హీరోల ప‌రువు తీసింది..!!

మెగా, నంద‌మూరి హీరోల ప‌రువు తీసింది..!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గానే కాకుండా.. హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ చెర‌గ‌ని ముద్ర వేసుకుంది అనుష్క‌శెట్టి. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్ హీరోల‌తో ఓ ఆట ఆడేసుకుంటుంది. అయితే, ఇటీవ‌ల కాలంలో స్టార్ హీరోలు న‌టించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్న స‌మ‌యంలో అనుష్క మాత్రం అందుకు భిన్నంగా త‌న చిత్రాల‌తో హిట్ కొడుతూ స్టార్ హీరోల‌కు దిమ్మ తిరిగేలా షాక్‌లు మీద షాక్‌లు ఇస్తోంది.

అయితే, తాజాగా ఈ యోగా బ్యూటీ న‌టించిన భాగ‌మ‌తి చిత్రం జ‌న‌వ‌రి 26న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. థ్రిల్ల‌ర్‌, ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ కావ‌డంతో సినీ అభిమానులు భాగ‌మతికి ప‌ట్టం క‌ట్టారు. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు.. చాలా స్ర్టాంగానే దూసుకుపోతోంది. ఓవ‌ర్సీస్‌లో అయితే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింద‌ని ఇండ‌స్ర్టీ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.50 కోట్ల గ్రాస్‌, రూ.30 కోట్ల షేర్ రాబ‌ట్టింది. దీంతో ఈ చిత్ర బృందం ఫుల్ హ్యాప్పీలో ఉంది. ఇలా స్వీటి హిట్ కొట్ట‌డంతో ఈ ఏడాది సంక్రాంతికి భాగ‌మ‌తిని ఒక వేళ విడుద‌ల చేసుంటే.. మెగా (అజ్ఞాత‌వాసి), నంద‌మూరి (జ‌య‌సింహా) హీరోల ప‌రువు పోయి ఉండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat