తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో ఈ రోజు పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పుతూ..చూపించారు.
see also :ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
see also :19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వరంగల్ లో మోనో రైలు కోసం ఇంటమిన్ కంపెనీ దగ్గర ప్రతిపాదించారు. దీంతో, గతంలో ఒకసారి అధ్యయనం చేసిన కంపెనీ బృందం, సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో ఇవాళ పరిశీలించింది. రూ.12 వందల కోట్ల ఖర్చుతో వరంగల్ లో మోనో రైలు ప్రాజెక్టుని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నారు.
see also :మంత్రి కేటీఆర్కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస