ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నా సంగతి తెల్సిందే.అలాంటి వారికోసమే ఈ వార్త .ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీ కార్పోరేట్ సంస్థ సోషల్ రెస్పాన్స్ కింద వైద్య ఆరోగ్య విద్య రంగాల్లో మొత్తం నూట అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
అందులో భాగంగా మొత్తం ఐదు వేలమందికి ఉపాధిని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే స్థానికులు సహాయసహకారాలను అందిస్తే ఈ ఏడాది మరో రెండు వేలమందిని నియమిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ముఖ్యంగా నాన్ టెక్నికల్ విభాగంలో ఇప్పటికే రెండు వేల ఉద్యోగాలిచ్చాం రానున్న రోజుల్లో మరో రెండు వేల ఉద్యోగాలను సృష్టిస్తాం అని యూపీ పెట్టుబడుల సదస్సులో హెచ్ సీ ఎల్ టెక్నాలజీ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు .మొదట నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం లక్ష ఇరవై వేలమంది పని చేస్తున్నారు .మొత్తం 7.5 బిలియన్ల డాలర్ల సంస్థగా ఎదిగిందని ఆయన తెలిపారు ..