తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల మనసును గెలుచుకుంటోంది. తాజాగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న బయో ఏషియా సదస్సునేపథ్యంలో అనూహ్య ప్రశంసలు దక్కాయి. బయోఏషియాలో పాల్గొన్న ప్రఖ్యాత బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్ షా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని 20 టాప్ స్టార్ట్ అప్స్ తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
SEE ALSO :బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..
ఈ సందర్భంగా మంత్రి నాయకత్వాన్ని కిరణ్ మజుందార్ షా అభినందించారు. మంత్రి నాయకత్వంలో దేశంలో ఉన్నత ప్రమాణాలున్న సైన్స్ మరియు ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందన్నారు. మంత్రి కేటీఆర్ లాంటి నాయకులను చూసినప్పుడు పారిశ్రామికవేత్తలకు స్పూర్తి కలుగుతుందని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు. హైదారాబాద్ నగరంపైన సైతం కిరణ్ మజుందార్ షా ప్రసంశలు కురిపించారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు అయారంగాల్లోని నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఎర్పాటు చేయాలన్నారు.