తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం మత్తయ్య అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు జెరూసలేం మత్తయ్య.
see also : మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ `ఓటుకు నోటు కేసులో నాకు అసలు సంబంధం లేదు. నన్ను టీడీపీ వాడుకోవాలని చూశాయి. నేను స్టీఫెన్సన్ ని కలిసింది మా క్రిస్టియన్ సమస్యల మీదనే. అతనితో ఏ ఇతర అంశాలు నేను చర్చించలేదు. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సహకరించింది. సుప్రీంకోర్టు కేసు విషయంలో నాకు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. అందుకే నేను పార్టీ ఇన్ పర్సన్ గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశాను. నాకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు చెబుతానని పేర్కొన్నాను అని మత్తయ్య వివరించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
see also :వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?