ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..
ఇది మంచి పధ్ధతి కాదు.విజయసాయి రెడ్డి చేసిన తన ఆరోపణలకు ఆధారాలను చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.అయితే రానున్న కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.మా సంగతి చూసే అంతా సీను లేదని ..విజయసాయి చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదు.అవసరమైతే వైసీపీ పార్టీను కూకటి వేళ్ళతో పీకి పారేస్తాం..తాము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులమని ఆయన అన్నారు ..