ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే.
see also : అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
see also : మార్కెట్ కమిటీ ఛైర్మన్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్
చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు..
రాయలసీమ వారు గొడ్డుకారం తింటారు.
తెలంగాణ వారికి అన్నం తినడం నేర్పించింది ఎన్టీఆర్. రాయలసీమ వారు గూండాలు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?,
ఆడ బిడ్డకంటే.. మగ బిడ్డే నయం.
రైతులు సోమరిపోతులు
రెడ్లు మడ్డివాళ్లు అంటూ చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.
see also : గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!
ఇదిలా ఉండగా.. ఇటీవల ఉండవల్లిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పంట నష్టపోయినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో రైతులు సోమరిపోతులుగా తయారవుతున్నారని, ఈ పద్ధతి మారాలంటూ రైతులను, పేదలనుద్దేశించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు విన్న రైతు సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు తినేది రైతులు పండించిన అన్నమే కదా..! అటువంటి రైతు విపత్కర పరిస్థితుల్లో పంటనష్టపోతే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ విరుచుకుపడుతున్నాయి రైతు సంఘాలు. వెంటనే రైతులకు క్షమాఫన చెప్పాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చంద్రబాబు రైతులు, పేదలు, వివిధ వర్గాలు, ఆడ బిడ్డ, మగ బిడ్డ అంటూ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీ భవిస్తారా..?