దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుండి నిన్న మొన్ననే ఆ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి వరకు అందరు కల్సి ప్రజాచైతన్య యాత్ర పేరిట బస్ యాత్రను మొదలెట్టారు.
అయితే తాజాగా రేవంత్ రెడ్డి వలన ఆ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ క్రమంలో తమ పార్టీకి ఎంతో సెంట్ మెంట్ గా భావించే చేవెళ్ళ నుండి యాత్ర ప్రారంభమైంది.అయితే దీనికి ముందు అక్కడ బహిరంగ సభ ప్రారంభమైంది.ఈ సభ వేదికపై అందరికి సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు.కానీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయిన కుంతీయాకు ప్లేస్ లేకుండా ఇటివల పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి అవకాశమిచ్చారు.అంతే కాకుండా సభలో రంగారెడ్డి జిల్లాకు ఇంచార్జ్ అయిన డీకే ఆరుణకు మాట్లాడానికి అవకాశం ఇవ్వకుండా ఏకంగా సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతుండగానే కార్యకర్తలు డిమాండ్ చేశారని మధ్యలోనే ఆయన స్పీచ్ ను ఆపేసి రేవంత్ రెడ్డికి మాట్లాడానికి అవకాశమిచ్చారు.
అంతే ఒకపక్క రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయిన కుంతీయాకు వేదికపై సీటు కేటాయించకపోవడం ..మరోవైపు పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి డీకే ఆరుణకు మాట్లాడానికి అవకాశం ఇవ్వకపోవడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వడం ..ఎప్పటి నుండో పార్టీలో ఉంటున్న అరుణకు ఇవ్వకపోవడం వెనక పొమ్మనలేక పొగ బెడుతున్నారు అని టీపీపీసీ సీనియర్ నేత ఒకరు బహిరంగంగానే పార్టీ రాష్ట్ర అధిష్టానం మీద విమర్శలు చేశారు.పార్టీ అధిష్టానం మున్ముందు ఇలాగే వ్యవహరిస్తే తమ దారి తాము చూసుకుంటామని సదరు నేత హెచ్చరించడం ప్రస్తుతం పలు అనుమానాలకు దారితీస్తుంది..