ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి నియోజక వర్గం సరిగ్గా అరవై మూడు యేండ్ల కిందట అంటే 1955లో ఏర్పాటు చేయడం జరిగింది.అప్పటి నుండి నేటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు ,టీడీపీ పార్టీ నాలుగు సార్లు ,మిగతా మూడు సార్లు స్వతంత్రులు గెలుపొందారు.
See Also:2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?
వైసీపీ ఏర్పడిన తర్వాత ఒక్కసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన కానీ వైసీపీ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదమూడు వందల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాడు.అయితే దర్శినియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి శిద్ధారాఘవరావుపై కేవలం 1374 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలవ్వడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
See Also:YSR లాంటి దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న అవినీతి,అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే కాకుండా మంత్రిగా ఉన్న కానీ నియోజక వర్గ ప్రజలకు ఏమి చేయకపోవడం ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి నేరవేర్చకపోవడం ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి బలమైన కార్యకర్తలు,క్యాడర్ తోపాటుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి నాయకత్వం ఆ పార్టీకి ఉండటంతో నియోజక వర్గంలో ఓటర్లు ఈసారి వైసీపీకి పట్టం కట్టాలని నిర్ణయంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఏది ఏమైనా కానీ పైన బాబు అసమర్థ అవినీతి అక్రమాల పాలనతో పాటుగా స్థానికంగా శివప్రసాద్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం కానున్నాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
See Also:ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!