Home / ANDHRAPRADESH / ”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ఏపీ టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. దానికి కార‌ణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదానే శ్వాస‌గా.. తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అటు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే.. మ‌రో ప‌క్క ప్ర‌త్యేక హోదాపై గ‌ళ‌మెత్తుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాతోనే న్యాయం జ‌రుగుతుందంటూ చాటుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు దేశ రాజ‌ధానిలో ఈ నెల 5వ తేదీన ధ‌ర్నా చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే.

see also : ఏపీ కి ప్రత్యేక హోదా..కేసీఆర్ ఏమన్నారంటే..?

see also : కట్టుకున్న భర్తను తమ్ముడితో కలిసి ఎలా చంపిందంటే..?

ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబు స‌ర్కార్ మాత్రం ఊస‌ర‌వెల్లి అవ‌తార‌మెత్తుతూ.. నిమిషానికో మాట మాట్లాడుతూ.. రెండు నాల్కుల ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ… కుఠిల రాజకీయాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ.. అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎటువంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కపోగా .. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ద్దు.. ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయేలా చంద్ర‌బాబు స‌ర్కార్ చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవ‌నే చెప్పాలి. అక్క‌డితో ఆగ‌క‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి. ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా సంజీవ‌నా..? ప్ర‌త్యేక హోదా అంశాన్నీ ప్ర‌త్యేక ప్యాకేజీలో ఉన్నాయి క‌దా..? అంటూ ప్ర‌జ‌ల‌నే ఎదురు ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ఇలా మోస‌పూరిత హామీలు ఇచ్చి అధికారం చేప‌ట్ట‌డ‌మే కాక‌.. ప్ర‌త్యేక హోదా అంశంలోనూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది చంద్ర‌బాబు స‌ర్కార్‌.

see also : శ్రీదేవి పై బయోపిక్ పై వర్మ క్లారిటీ..!

ఇదిలా ఉండ‌గా గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌పై త‌న మంత్రుల వ‌ద్ద ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా అధికార కార్య‌క్ర‌మాల‌న్నింటిని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ టీవీల‌ల్లో ప్ర‌సార‌మ‌వుతున్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఓ ప‌దిహేను నిమిషాలు చూశాడ‌ని టీడీపీ నాయ‌కుల స‌మాచారం. అందులో భాగంగానే ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వంతైంది. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ త‌న క్యాబిన్‌లో ల్యాప్‌ట్యాప్‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్రను వీక్షించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat