రాయలసీమ రాజకీయాలు మాత్రం హాట్ హాట్గా మారాయి. ఆదివారం కడప జిల్లాలోని పులివెందులలో టీడీపీ, వైసీపీ రెండు వైపుల నుండి రోడ్లపై దొరికిన రాళ్ళు, రప్పలను తీసుకుని ఒకరి పై మరొకరు విసురుకున్నారు. దీంతో పులివెందుల పట్టణంలో రాళ్ళ వర్షంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కొండసాని సురేశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే..ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాజీ కార్యదర్శి సురేశ్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చిన ఆయన నిద్రమాత్రలు మింగారు. ఇది గమనించిన పోలీసులు.. వెంటనే హాస్పిటల్కు తరలించారు.
see also..ఢిల్లీలో వైఎస్ జగన్ గురించి ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?
ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా జాయిన్ అయ్యారు.జేసీ దివాకర్ రెడ్డి పేరుతో భూబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సురేశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు జేసీ ద్వారా సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రికెట్ బూకీలతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఆయన మాత్రలు వేసుకున్నారని చెబుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఆయన ఎటువంటి నిద్రమాత్రలు వేసుకోలేదని.. కేవలం స్పృహకోల్పోయారని చెబుతున్నారు.
see also..తెలుగుదేశం పార్టీలో గౌరవం లేదని… టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..పార్టీ మారుతాడ..!
డాక్టర్ మాత్రం సురేశ్ రెడ్డి మాత్రలు వేసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు అలాగే చెప్పి తమ దగ్గరకు వచ్చి తీసుకొచ్చారని చెప్పారు. అయినా ఆయన స్పృహలోకి రాకపోవడంతో బెంగళూరు హాస్పిటల్కు తరలించారన్నారు.