ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్లో ఆంధ్రా ఎంపీలు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. కొందరు పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్ముడి విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించారు.
see also :ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
see also :హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..