కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.దీంతో రెండు పంటలు సాగవుతాయని చెప్పారు.నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చారిత్రక శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.వచ్చే ఖరీఫ్ లో 5,100 ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు.
గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆయన బుధవారం శనిగరం దగ్గర విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతుల బాగు కోసం పాటుపడలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక శనిగరం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.22 కోట్ల 72 లక్షలను మంజూరు చేశామని తెలిపారు. శనిగరం లో 1904 లో నిర్మించిన గెస్ట్ హౌజ్ ను చారిత్రక,పురాతన వారసత్వ సంపదగా కాపాడుతూనే దీన్ని పునరుద్ధరించి, అన్ని హంగులతో ఆధునీకరిస్తామని హరీశ్ రావు చెప్పారు.