ప్రతి రోజు అక్రమ సంబంధం తో ఎక్కడో ఒక్క చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెళైయ్యిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకుంది. భార్యతో కలిసి ఉన్న యువకుడిని చూసిన భర్త కోపంతో యువకున్ని హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని టంగాపూర్ కాలనీకి చెందిన సైదులు (22) తన పక్కింటి వివాహితతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. మహిళ భర్త తాగుడుకు బానిసై ఇంటికి సరిగ్గా రాకపోతుండంతో ఎప్పుడూ మహిళ ఇంట్లోనే ఉండేవాడు. ఈ విషయం మహిళ భర్తకు తెలిసి చాలా సార్లు గొడవ జరిగింది. దీనిపై గతంలో పోలీసుల వద్ద పంచాయితీ కూడా జరిగింది. అయినా సైదులు ఈ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.
అయితే నిన్న రాత్రి ఫుల్లుగా మద్యం తాగి మహిళ భర్త గణేష్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో సైదులు తన భార్య పక్కనే పడుకుని ఉండడాన్ని గమనించాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన గణేష్ వేట కొడవలితో నిద్రలో వున్న సైదులుపై దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్, డీఎస్పీ, సీఐలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.