దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది.ఈ క్రమంలో కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ రోజు శుక్రవారం తీర్పును ప్రకటించింది.వైద్యానికి చికిత్స చేయలేని కోమాలోకి వెళ్ళితే ఆ బాధితులను లైఫ్ సపోర్ట్ మీద ఉంచోద్దని క్లారిటీ ఇస్తూ రోగులు చికిత్సకు ముందే లివింగ్ విల్ కూడా రాసేందుకు అనుమతిచ్చింది.
ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం కారుణ్య మరణాలపై తీర్పును వెలువరిస్తూ గౌరవంగా మరణించే హక్కు మానవులకు ఉంది.ఇది ప్రాధమిక హక్కు కిందకు వస్తుంది .కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని సుప్రీం కోర్టు అందుకు దగ్గ మార్గదర్శకాలు జారీచేసింది.