తిరుమల శ్రీ వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని నిన్న 61,013 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 2.72 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు.
see also :కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!