తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసల జోరు మొదలైన సంగతి తెల్సిందే.
అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహదేవపూర్ నుండి వంద మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే పుట్ట మధు యువకులకు గులాభి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 సంవత్సరాలు చేసిన అభివృద్ది తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వత టిఆర్ఎస్ రాష్ర్ట ప్రభు త్వం మంథని నియోజకవర్గ అభివృద్ధిని ముడెళ్ళలోనే అంతకు ముడింతలైందని అభి వృద్ధికి ఆకర్శితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతు న్నారన్నారు. మంథనిలో కాంగ్రెస్ ఇప్పటికే కాలీ అయిపో యిందన్నారు.