టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే.. కొంతమంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఘటన మరవకముందే మరోక బాంబ్ పెల్చింది. హసీన్.. విదేశాల్లో పర్యటించే సమయంలో షమీకి సెక్స్ వర్కర్లతో సంబంధాలు ఉండేవని ఆరోపించింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పింది.
see also..భర్త డ్యూటీకి వెళ్లగానే భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం…?
అంతే గాకుండా.. షమీ వాళ్ల అన్నయ్యతో శారీరక సంబంధం పెట్టుకోమని క్రికెటర్ తనను బలవంతం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ‘వాళ్ల అన్నయ్య హసీబ్ గదిలో ఉన్నాడు. మేమిద్దరం గది బయట ఉండగా.. షమీ నాతో ఈ విషయం చెప్పాడు. షమీ నన్ను ఆ గదిలోకి తోసి తాళం వేశాడు. హసీబ్ నాతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ నేను కేకలు వేయడంతో షమీ తలుపు తెరిచాడ’ని హసీనా మీడియాకు తెలిపింది. ఈ విషయమై ఆమె పోలీస్ స్టేషన్లో షమీపై కేసు కూడా నమోదు చేసింది. భారత పేస్ బౌలర్తోపాటు నలుగురు కుటుంబ సభ్యులపై కూడా కోల్కతాలోని జాదవ్పూర్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
see aslo.. మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన ట్వీట్..!!