ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కానీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే రచ్చ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వలైన బీజేపీ ,టీడీపీ పార్టీలు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీను నేరవేర్చమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు ,పలు ప్రజాసంఘాలు చేస్తున్న ధర్నాలు ..రాస్తోరోకులు .
అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సవాలు విసురుతూ ఒక వీడియోను విడుదల చేశారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ సృష్టిస్తుంది.ఈ వీడియోలో జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదా లో ఉన్న చంద్రబాబు తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు.ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 21న తమ పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టనున్నం .దీనికి మద్దతుగా బాబు నిలవాలి.లేదా చంద్రబాబు చెప్పిన సమయంలో పెట్టడానికి నేను రెడీ ..అయన మద్దతు ఇవ్వాలి .లేదా తను పెట్టమనండి నేను మద్దతు ఇస్తా అని ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..