Home / SLIDER / నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం జరుగనున్నది.రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరుఫున పోటీచేయనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఈ సమావేశంలో ఆయన పరిచయం చేసే అవకాశం ఉన్నది.

see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!

ముఖ్యంగా ఈ సమావేశంలో రేపటి నుండి శాసన సభలో జరిగే చర్చల సందర్భంగా ప్రభుత్వ పథకాలను సమర్థంగా లెక్కలతోసహా వివరించడం, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై మంత్రులు పకడ్బందీగా సమాధానాలు ఇవ్వడం, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ స్పష్టమైన సూచనలు చేయనున్నారు.

see also :కామెడీ చేసేందుకు టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌య‌మిది!

కాగా రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒక స్థానాన్ని యాదవులకు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.మొత్తం మూడు స్థానాలనూ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా గెలుచుకోవడం ఖాయమని తేలిపోయింది. మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 23న జరుగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎం ఐఎం సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat