తెలంగాణ సాయుధ పోరాటంలో నడుం బిగించిన వీరనారి చెన్నబోయిన కమలమ్మ మృతి పట్ల నగర మేయర్ నన్నపునేని నరేందర్ తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు..ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..కమలమ్మ ఆత్మ కు శాంతి చేకూరాలని మేయర్ కోరారు… తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరనారి కమలమ్మ ఎందరికో ఆదర్శం,ఆమె మృతి చెందడం ఉద్యమ లోకానికి తీరని లోటు అని మేయర్ అన్నారు.
వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో జన్మించిన కమలమ్మ ఖ్యాతి దేశదేశాల కు వ్యాపించడాం మనకెంతో గర్వ కారణం అన్నారు. ఉద్యమ జీవితంలో చూపిన గుండె ధైర్యానికి రష్యా, జర్మనీ దేశాలు కమలమ్మ చరిత్ర పుస్తకా లలో పొందుపరిచడం, కమలమ్మ చరిత్ర రాష్ట్ర ప్రభు త్వం సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా పొందు పర్చడం గర్వించదగినదన్నారు.
కమలమ్మది కోయిల గొంతు. పాటలతో గొల్లసుద్దులతో రజాకార్ల దురా గతాలను కళ్ళకుకట్టినట్లు చెప్పి కోయప్రజలను ఉత్తేపరిచారు ఉద్యమానికి, విముక్తి కోసం రజా కార్లను ఎదురించిన ధైర్యశీలి కమలమ్మ… కమలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో తన బిడ్డను త్యాగం చేశారు. తెలంగాణ కోసం తాను కూడా పనిచేసి గుర్తింపు పొందారు. ఆమె పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి తెలంగాణ ప్రభుత్వం 2016లో మహిళా అవార్డుతో సత్కరించింది. ఇంతటి ఘాన చరిత్ర గల కమలమ్మ నేడు మరణించడం చాలా భాద కరం గా ఉందని మేయర్ విచారం వ్యక్తం చేశారు