Home / ANDHRAPRADESH / ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!

ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా యావత్తు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో పాటుగా ఏపీ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి యాదవులకు కేటాయించడంతో ఏపీ యాదవుల సంఘం పాలాభిషేకం చేసింది.

రాష్ట్రంలో ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రాష్ట్ర యాదవుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో యాదవుల కోసం గొర్రెలను పంపిణీ చేశారు.అంతే కాకుండాచరిత్రలో ఎక్కడ లేని విధంగా యాదవులకు రాజ్యసభ పదవి కట్టబెట్టి యాదవుల పక్షపాతి అని నిరుపించుకున్నారు .భవిష్యత్తులో ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటి చేసే దిశగా కేసీఆర్ ఆలోచించాలని వారు కోరారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat