Home / Uncategorized / ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డిలు కంపెనీ సినియర్ ప్రతినిధి బృందానికి ఈరోజు హైదరాబాద్లో అందజేశారు. కంపెనీ ప్రతినిధి బృందంతోపాటు జపాన్ ప్రధాన మంత్రి  ప్రత్యేక సలహాదారు మితుషిరో మియాకోషి, ,ఇసే పూడ్స్ చైర్మన్, జపాన్ వ్యవసాయం శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశం అయ్యారు.

see also : ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!

సే పూడ్స్ సూమారు 47 బిలియన్ల యెన్ల అమ్మకాలను గత ఏడాది నమోదు చేసింది. కంపెనీకి దేశ విదేశాల్లో పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇసే పూడ్స్ సిద్దిపేటలోని నంగనూర్ మండంలోని నర్మెట్టా గ్రామంలో సూమారు 140 ఏకరాల్లో తన పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. ఇక్కడ నుండి కొడి గుడ్ల ప్రాసెసింగ్ పరిశ్రమంతోపాటు, కోళ్ల ఫాంలో లభించే వ్యర్ధలతో సేంద్రియ ఏరువులను సైతం తయారు చేయనున్నది. దీంతోపాటు పౌల్ట్రీ టెక్నాలజీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి విద్యార్ధులను శిక్షణకోసం జపాన్ తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటు సుజుకి కంపెనీ భాగస్వామ్యంతో లిధియం అయాన్ బ్యాటరీల అర్అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.  ఇదే కేంద్రం నుండి రెండు మూడు సంవత్సరాల్లో బ్యాటరీలను సైతం ఉత్పత్తి చేయనున్నది. ఇసే పూడ్స్ హైదరాబాద్లోని నేషనల్ బ్యాడింటన్ అకాడమీ ద్వారా టోక్యో ఒలంపిక్స్‌లో  పాల్గొనే క్రీడాకారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఒక యంవోయును ఈ సదర్భంగా కుదర్చుకున్నారు.

see also :ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!

జపాన్  కు చెందని ప్రముఖ కంపెనీ  తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. జపాన్లో పెట్టుబడుల కోసం పర్యటన చేసిన సందర్భంగా ఈ కంపెనీతో యంవోయు కుదుర్చుకున్నామని మంత్రి గుర్తు చేశారు. జపాన్ ప్రధాని సలహాదారు, కంపెనీ చైర్మన్ మరియు ప్రతినిధులతో మంత్రులు సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, పాలసీలు, ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వివరించారు. జపనీస్ లో ముద్రించిన తెలంగాణ పారిశ్రామిక పాలసీని మంత్రి అందించారు. తెలంగాణకు జపాన్ కు మద్య మంచి సంబంధాలున్నాయని, ఇప్పటికే జైకా వంటి అర్ధిక సంస్ధలు తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా పెట్టుకున్నదని, ముఖ్యంగా పుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ ప్రణాళికలను మంత్రి వివరించారు. తెలంగాణ సీడ్ బౌల్ అప్ ఇండియాగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రతి నియోజక వర్గానికి ఓక్క పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat