వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే, వైఎస్ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏపీ రాజకీయ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు వైఎస్ జగన్పై రాజకీయ కుట్రలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొందరైతే వైఎస్ జగన్పై కుట్రపూరిత కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. మరికొందరైతే అర్థబలం, అధికార బలం, మీడియాబలం ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలన్న లక్ష్యంతో నిరంతరం పనిచేశారు కూడాను. అందులో ముందు వరుసలో ఉన్నవారు సోనియా గాంధీ, చంద్రబాబే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయపరంగా ఎన్నో కష్టాలను ఎదుక్కొని ప్రజల పక్షాన నిలిచారు.
see also : వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
see also : చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
నాడు కాంగ్రెస్ పార్టీని వీడితే కుంట్రపూరిత కేసులతో తనను జైల్లోకి పంపుతారని తెలిసినా కూడా వైఎస్ జగన్ అందుకు జంకకుండా ప్రజల పక్షాన నలిచారు. పార్టీ స్థాపించినప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యన ఎక్కువ సమయం గడిపిన రాజకీయ నాయకుడిగా వైఎస్ జగన్ రికార్డు సృష్టించాడు. పైగా నియంతృత్వ లక్షణాలు ఉన్న చంద్రబాబు, పేపర్లో సమస్యలను చదివి మీడియా ముందు డబ్బా కొట్టే పవన్ కల్యాణ్ కన్నా ప్రత్యక్షంగా ప్రజా మస్యలు తెలుసుకున్న వ్యక్తుల్లో వైఎస్ జగన్ ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.