గులాభీ దళం లో ఇన్నాళ్లూ తెర వెనుక కీలకపాత్ర పోషించిన మరో యువ కెరటం ప్రజా క్షేత్రంలోకి అడుగిడింది. ఆ యువ కెరటం పేరు సంతన్న . పూర్తి పేరు జోగినపల్లి సంతోష్ కుమార్ . టీ ఆర్ ఎస్ పార్టీలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు . గులాభీ రథసారధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నంటి ఉండే సంతన్న చిన్న వయస్సులో మహా ఉద్దండులు ఉండే పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు . ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే సంతన్న అంటే టీ ఆర్ ఎస్ శ్రేణులకు ఒక ఎనర్జీ .
see also :రేవంత్కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
2001 లో ప్రారంభమైన ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ కార్యక్రమాలను , వివిధ స్థాయిల్లోని నాయకులను సమన్వయం చేయడంలో సంతన్న చాలా కీలక పాత్ర పోషించారు . అధినేతకు వెన్నుదన్నుగా నిలిచారు . ఇప్పుడు చిన్న వయస్సులోనే పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు . తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో వినిపించేందుకు ఇక సంతన్న సిద్దమవ్వాల్సి ఉంది . రాజ్యసభలో సంతన్న మాట్లాడుతుంటే చూడాలని గులాభీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి .
see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..?
గులాభీ దళపతి కేసీఆర్ మొదలు పెట్టిన జాతీయ స్థాయి ఫెడరల్ ఫ్రంట్ విషయంలోనూ సంతన్న సమన్వయ బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తాడని ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు . భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో సంతన్న మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..సంతన్నకు శుభాకాంక్షలు..