ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత ఘనంగా స్వాగతం పలికారు. ఆరు జిల్లాల్లో 109 రోజుల పాటు కొనసాగిన ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది.
see also..జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఈ సందర్భంగా స్టువర్టుపురంలో నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో జగన్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత పెద్దయెత్తున తరలివచ్చారు. మహిళలు జగన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే వైఎస్ జగన్ కు గుంటూరు జిల్లాలో భారీగా యువత హాజరవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఉండబోతుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం అధికారంలో టీడీపీ పాలనలో ఒక్క ఉద్యోగం లేదు..నిరుద్యోగ భృతి లేదు, 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటి చెయ్యకపోవడమే వల్లనే అని తెలుస్తుంది.