తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి
వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలపై బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్.
See Also:వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
ఈ అంశం మీద బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులపై చర్యలు తీసుకునే ముందు సభలోని ఫ్లోర్లోని లీడర్స్ ను పిలిపించి మాట్లాడితే బాగుండేది.ఇలా సభ్యులను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు.దీన్ని మా పార్టీ తరపున ఖండిస్తున్నాం .అయితే దేశ పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇలా చేస్తే మేము ఎమన్నా చేశామా అని సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మీరు ఇలాంటి అరాచకాలు చేసేవారిని ప్రోత్సహిస్తాను అని చేయండి.
See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
కేవలం ఈ సభ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకే పరిమితమా ..మిగిలిన తొంబై మంది ఎమ్మెల్యేలకు లేదా..ప్రజల సమస్యలపై చర్చించడానికి మేము ఎన్ని రోజులు అయిన సభను నడుపుతాం అని చెప్పాం.అయితే గవర్నర్ మీద దాడిని మీరు సమర్ధిస్తే సభకు ఔన్నత్యం పెరుగుతుందా..ఇప్పుడు ఆ దాడిని మీరు సమర్ధించడం ఎంతవరకు కరెక్ట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు ..
See Also:వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!