ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు.
see also :పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!
ముఠాకు నాయకుడిగా వ్యవహరించిన జానారెడ్డి ఇవాళ తననెందుకు సస్పెండ్ చేశారని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. సభలో దాడుల వల్ల రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలుగుతదని జానారెడ్డి తన తోటి సభ్యులకు చెప్పలేకపోయిండన్నారు . ప్రతి సందర్భంలోను గవర్నర్తో పాటు స్పీకర్, చైర్మన్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. స్వామిగౌడ్పై దాడి చేసిన అనంతరం.. కొంతమంది సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డితో షేక్హ్యాండ్ చేసుకోవడం ఎంత వరకు సబబు అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..!
see also :ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్ప్రైజ్