తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
see also :వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.ఎన్ని రోజులైనా సభలో చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ .. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడంసరి కాదన్నారు. సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారు. తమకు నాటకం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సభలో కూర్చుంటే వచ్చది ఏమీ లేదు. ఎలాగైన బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని సీఎం అసలు గుట్టు విప్పారు.
see also :తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!