తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద
విసిరేశారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ పైన ఉన్న గాంధీ బొమ్మకు తగిలి మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయమైంది.దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టిన సస్పెన్షన్ వేటు తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదన చారీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి ,సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మిగత పదకొండు మంది ఎమ్మెల్యేలు అయిన జానారెడ్డి,గీతారెడ్డి,జీవన్ రెడ్డి,చిన్నారెడ్డి,ఉత్తమ్ ,మాధవ్ రెడ్డి,డీకే ఆరుణ ,భట్టి విక్రమార్క ,రామ్మోహన్ రెడ్డి ,వంశీధర్ రెడ్డి ,పద్మావతి రెడ్డిను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు విధిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు ..