అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని
యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు.
See Also:ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
అధికారం లేకపోయిన కానీ క్షణాల్లో ప్రజలు విన్నవించుకున్న సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న యువ ఎమ్మెల్యే అతనే సింహపూరి (నెల్లూరు )ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ .నిన్న మంగళవారం ఉమ్మడి హైకోర్టు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసిన సంగతి తెల్సిందే.ఈ విషయం గురించి అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని ఏండ్లు ఇన్ని ఏండ్లు అనుభవం ఉందని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు చేర్చుకోవడమే కాకుండా సిగ్గు లేకుండా నలుగురికి మంత్రి పదవులిచ్చారు.
See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
దమ్ముంటే ..పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోవాలి .మరల తిరిగి గెలిపించుకోవాలి .ఇరవై రెండు స్థానాల్లో ఒక్క సీటు వైసీపీ ఓడిపోయిన నేను రాజకీయ సన్యాసం చేస్తా ..ఇరవై రెండు గెలవకపోతే బాబు ఇంట్లో కూర్చుంటారా అని “సింహా”పూరి దెబ్బ ఎలా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడుకు రుచి చూపించారు.అయిన నీతి నిజాయితీ ఉన్న రాజకీయాలను యువకుడు ,ఎటువంటి అనుభవం లేని జగన్ నడిపిస్తున్నారు.అందుకే ఇటివల పార్టీలోకి ఎమరెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నాడు .అది మగాడి సత్తా ..దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని ఆయన సవాలు విసిరారు ..
See Also:2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!