దేశ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం విడుదలవుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది.ఈ క్రమంలో ఏకంగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో ఆ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు భారీ మెజారిటీతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..!
అందులో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో అధికార బీజేపీ పార్టీ తరపున పోటి చేసిన అభ్యర్థి డెబ్బై వేల పదమూడు ఓట్లను సాధించగా ..ప్రతిపక్ష పార్టీలు అయిన ఎస్పీ-బీఎస్పీ మిత్రపక్షం తరపున పోటి చేసిన అభ్యర్థి డెబ్బై నాలుగు వేల డెబ్బై ఏడు ఓట్లతో మూడు వేల ఎనబై నాలుగు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
See Also:ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
ఇక మిగిలి స్థానాల విషయానికి వస్తే అరారియా లోక్ సభ స్థానంలో బీజేపీ పార్టీ యాబై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఓట్ల ఆధిక్యంలో ఉంది.పూలపూర్ లో మాత్రం వెనకంజలో ఉంది.బబువా అసెంబ్లీలో రెండు వేల ఐదు వందల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉన్న కానీ జహానాబాద్ లో మాత్రం పదమూడు వందల ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ ముందంజలో ఉంది ..
See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!