టెక్నాలజీ పెరిగింది. నగరం కొత్త కొత్త హంగులతో కళ కళ లాడుతున్నది. కాని నేరాలు మాత్రం ఆగడం లేదు. నగరంలో ఎకం్కడ చూసిన నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎవరికైన అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను వాడేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కామాంధుడు తన కామా కొరిక కోసం టెక్నాలజీని వాడాడు. సోషల్ మీడియాలో ఒక బాగం అయిన వాట్సప్ లో మహిళను పరిచయం పెంచుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓల్డ్ మలక్ పేటలో నివాసం ఉండే పవన్ కుమార్ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.. ఆరు నెలల క్రితం బాలాపూర్లో నివాసం ఉండే ఓ పెళ్లయిన యువతితో వాట్సప్ స్నేహం కలుపుకున్నాడు. క్రమంగా వరుస మెస్సేజులతో దాన్ని కొనసాగించాడు. అలా పరిచయం పెంచుకుని ఏకంగా ఆ మహిళ ఇంటికే వెళ్లిపోయాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ.. భర్తకు చెబుతానని బెదిరిస్తూ పలుసార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఫిబ్రవరి 18 న ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసి.. ఆ తర్వాత చేతికి అందిన వస్తువులతో ఉడాయించాడు. దాదాపు 60 వేల రూపాయల నగదు, బంగారంతో పరారయ్యాడు. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. జాగ్రత్త మరెవరు ఇలా మోసపోకండి.