తెలంగాణ ప్రస్తావన వస్తేనే నిత్యం తన ఏడుపును ప్రదర్శించే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు టీఆర్ఎస్ పార్టీ యువనేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
see also :త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
తెలంగాణ ఉద్యమం విషయంలో చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం మానుకోవాలని మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ ద్వారా హితవు పలికారు. సెంటిమెంట్ కోసమే ‘తెలంగాణ’ రాష్ట్రాన్ని ఇచ్చారనేది సరికాదని తెలుసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున ఆయన చేస్తున్న కామెంట్లను తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. `చంద్రబాబు గారు మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం నినాదంతో సాగింది. ఉద్యమం సమయంలో మాకు ప్యాకేజీ సహా మరెన్నో ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మేం రాష్ట్రం కోసం పోరాడాం. రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాటం చేయండి తప్పేంలేదు. కానీ ఈ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేయకండి. మా రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన వారిని తక్కువ చేయవద్దు`అని కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
see also :ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచన..మంత్రి కేటీఆర్ కృషి..!