వినడానికి విడ్డూరంగా ..నమ్మశక్యం కానీ విధంగా ఉన్న కానీ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన వలన అన్ని విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సంజీవని అని ..దాన్ని తీసుకొచ్చే ఏకైక మగాడు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీఎల్పీ సమావేశంలో అధికార పార్టీ నేతలతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు శుక్రవారం వైసీపీ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే వైసీపీకి కాంగ్రెస్ ,లెఫ్ట్,శివసేన తదితర పార్టీలు మద్దతు ఇచ్చాయి.అయితే తెలుగుదేశం పార్టీ నిన్నటి వరకు మద్దతు ఇస్తామని తెలిపి ఏకంగా ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఎన్డీఏ నుండి బయటకు వచ్చేస్తాం ..మేమే అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే జగన్ పోరాటం వలనే ప్రత్యేక హోదా వచ్చింది.అందరు మరిచిపోతున్న తరుణంలో ఒక మగాడి లా పోరాడి ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అని జగన్ పై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.అలా జరగకుండా ఉండాలంటే మనమే సొంతగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకుంటున్నాను అని తెలుగు తమ్ముళ్ళతో చెప్పేశారు అంట బాబు .దీంతో ఒక్కసారిగా కంగు తిన్న తమ్ముళ్ళు నాలుగు ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అన్న బాబు నోటితో ప్రత్యేక హోదా కోసం పోరాడే విధంగా చేసిన జగన్ ప్రజల్లో దృష్టిలో హీరో ..మగాడు అని చర్చించుకోవడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది…