ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.
See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!
తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్లు పంపించారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు .
See Also:YSRCPశ్రేణులకు గుడ్ న్యూస్-జగన్పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
తాజాగా ఆ వ్యాఖ్యలపై నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మనం ఎందుకు ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి.మనం చేసే పనులను బట్టి ఓటర్లు ఓట్లు వేస్తారు.ఒక్కరూపాయి కూడా అవినీతి లేకుండా చేయాలనీ నేను చూస్తుంటే ఇలా ఆరోపణలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు .
See Also:పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!