తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం”వస్తున్నా మీకోసం “పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.అయితే అప్పటి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర గురించి మంత్రి నారా లోకేష్ నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లునడిచారు అని గొప్పలు చెప్పుకోబోయి చిన్నబాబు అడ్డంగా దొరికారు.ఈ వీడియోపై నెటిజన్లు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు .మీరు ఒక లుక్ వేయండి ..ఈ క్రమంలో శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అనే నెటిజన్ వేసిన సెటైరికల్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేమిటి అంటే “పేపర్ మీద రాసుకుని చదువుతూ కూడా..మా నాన్నారు 2008 రోజులు నడిచారని లోకేశ్ చెబుతున్నారంటే …నిజంగా పెద్దల సభకి చినబాబుని ఎంపిక చేసిన పెదబాబుని అభినందించాలి సుమీ !ప్చ్…పెద్దల సభలో మేధావులు మాత్రమే ఉంటారని నేనిన్నాళ్ళూ అనుకునేవాడిని…అపర మేధావులుకూడా ఉంటారన్నముక్క నాకిప్పుడే తెలింది మరేటిసేత్తాం !”..