Home / MOVIES / ప‌వ‌న్ రాజ‌కీయంపై అల్లు అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప‌వ‌న్ రాజ‌కీయంపై అల్లు అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేసి మెగా అభిమానుల‌కు ఉగాది పండుగ ప‌ర్వ‌దినం శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ఇవాళ వైజాగ్‌లో జ‌రిగిన రంగ‌స్థ‌లం చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌, డైరెక్ట‌ర్ సుకుమార్‌తోపాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ వేడుక‌కు యాంక‌రింగ్ చేసిన సుమ ఒక్కొక్క‌రిని వేదిక‌మీద‌కు పిలుస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్న నేప‌థ్యంలో వేదిక‌మీద‌కు వ‌చ్చిన అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

see also : 4బిల్డింగ్స్ కట్టడానికి 40ఏళ్ల అనుభవం కావాలా బాబు ..!

see also : కుక్క‌లు, న‌క్క‌లు క‌న్న‌ట్టు పిల్ల‌ల్ని క‌ని..! చ్ఛి..చ్ఛీ..!!

అయితే, అల్లు అర‌వింద్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఇలా మాట్లాడ‌టం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అల్లు అర‌వింద్ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాప‌న స‌మ‌యంలో చిరంజీవి వెంట ఉండి. త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న‌ది నీవు కాదా..? ప‌్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డానికి ముఖ్య‌కార‌ణం ప‌వ‌ణ్ క‌ల్యాణ్ పాత్రేన‌ని అంటూ అల్లు అర‌వింద్ మీడియా ముఖంగా చెప్పిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, చిరంజీవిని మోసం చేసిన వ్య‌క్తుల్లో మొద‌టి స్థానం ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే అన్న రీతిలో అల్లు అరవింద్ త‌న మాట‌ల‌తో రెచ్చిపోయారు.

తాజాగా, వైజాగ్‌లో జ‌రిగిన రంగ‌స్థ‌లం చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక‌లోనూ అదే రీతిలో ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేశారు అల్లు అర‌వింద్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సినిమా భిక్ష పెట్టిన వ్య‌క్తి చిరంజీవి అని, అలాంటి చిరంజీవిని మోసం చేయ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌న‌సెలా వ‌చ్చిందో అన్న రీతిలో అల్లు అరవింద్ మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఏదేమైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లు అర‌వింద్ ల మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌డ్డాయంటూ మెగా అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat