Home / TELANGANA / కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన గవర్నర్‌ కి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు

కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన గవర్నర్‌ కి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని  రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరి తరఫున ఉమ్మడి గవర్నర్‌‌ నరసింహన్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక సంవత్సరమే అనికాకుండా ప్రతి ఏడాదీ నిష్టతో చాలా చక్కగా నిర్వహిస్తున్న గవర్నర్‌కు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మనస్పూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేశారు. ఇది వరకు ఎప్పుడూ ఇలా రాజభవన్‌లో పండుగ లేదని.. గవర్నర్‌ నర్సింహన్ వచ్చాక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని సీఎం కేసీఆర్  చెప్పారు. ప్రభుత్వం ఓ వైపు అధికారికంగా జరుపుతున్నప్పటికీ.. రాజ్‌భవన్‌లో ఇటువంటి సత్‌సంప్రదాయానికి శ్రీకారం చుట్టి మన పండుగను మన గౌరవాన్ని ఇనుమడింపు చేస్తున్న గవర్నర్‌కు.. సీఎం కేసీఆర్  ధన్యవాదాలు తెలిపారు. యావన్మంది తెలుగు ప్రజలు, అన్య సంస్కృతుల, అన్య భాషల ప్రజలు కూడా సుఖంగా, సంతోషంగా విలసిల్లాలని సీఎం కేసీఆర్  ఆకాంక్షించారు.

 

see also :ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్

” కాలం జరుగుతూనే ఉంటుంది. కొంత మంచి వస్తుంటుంది.. ఇంకొంత చెడు వస్తుంటుంది. అన్నింటినీ సహిస్తూ, అన్నింటినీ భరిస్తూ.. ఆనందాన్ని ఆస్వాదిస్తూ.. దు:ఖాన్ని దిగమింగుతూ ముందుకు సాగేదే జీవితం. మనదేశంలో అనేక భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగువారు ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకోవటం.. పచ్చటి స్వీకరించడం అందులోనే మంచి, చెడు అనే రెండు అర్థాలున్నాయని ఈ రోజు ఆస్వాదించడం జరుగుతుంది. అందులోని పులుపు, వగరు, తీపిలాగా జీవితం కూడా ఇదేలా ఉంటుందనే సందేశాన్ని అందులో నుంచే అంతర్లీనంగా తీసుకోవడం.. ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాం” అని కేసీఆర్  ప్రసంగించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat