శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ క్రికెట్ల జట్ల మధ్య జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ-20 సిరీస్ ను అందరూ భావించినట్టే హాట్ఫేవరేట్ జట్టు భారత్ కైవసం చేసుకుంది. కాగా, కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ముక్కోణపు ట్రై సిరీస్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్, భారత్లు ఇవాళ తలడ్డాయి. అయితే, టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకుగాను ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
see also : జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే
see also : జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే శిఖర్ధావన్ ఔటయ్యాడు. అయితే, ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన కె.ఎల్ రాహుల్, రోహిత్ శర్మలు నిలకడగా రాణించడంతో రన్రేట్ కాస్త పరుగులు పెట్టింది. ఆ తరువాత కె.ఎల్ రాహుల్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంగ్లాదేశ్ ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ చేసిన మనీష్ పాండే, విజయ్లు కూడా బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలకడ గల బ్యాటింగ్తో రాణించలేకోయారు. చివర్లో దినేష్ కార్తీక్ ఎనిమిది బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. ఇలా .. భారత్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి నిదహాస్ ట్రోఫీని కైవసం చేసుకుంది.